1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (16:46 IST)

కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ ప్రధాని మోడీ సర్కారు నిర్ణయం?

దేశంలోని కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ సంస్థలకు పన్ను కుదించింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న 30 శాతం కార్పొరేట్ పన్ను నుంచి 25.17 శాతానికి తగ్గించింది. 
 
గోవాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జీఎస్టీ సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ కంపెనీల‌కు ప‌న్ను కుదింపు వ‌ల్ల లాభం చేకూర‌ుతుందని చెప్పారు. ఈ యేడాది ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక సంవ‌త్స‌రం నుంచి ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌న్నారు. 
 
విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. మార్కెట్లు దూకుడు ప్ర‌ద‌ర్శించాయి. అయితే ఎటువంటి మిన‌హాయింపు లేకుండా కంపెనీలు ప‌న్ను 22 శాతం క‌ట్టేందుకు ఐటీ చ‌ట్టాన్ని మార్చ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. క‌నీస ప్ర‌త్యామ్నాయ ప‌న్నును (మ్యాట్‌)ను ఎత్తివేస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. అలాంటి కంపెనీలు 25.17 శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు.