నకిలీ సందేశంతో వల విసిరారు - బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అలెర్ట్
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు టార్గెట్ చేసేలా సైబర్ మోసగాళ్ళు ఓ నకిలీ సందేశంతో వల విసిరారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారిని తప్పుదారి పట్టించే సందేశాలను పంపి ఖాతాలను ఖాళీ చేసేందుకు కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నారు.
తాజాగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను టార్గెట్ చేసేలా ఒక నకిలీ సందేశంతో వల విసిరారు. వినియోగదారుల కేవైసీ ట్రాయ్ నిలిపివేస్తుందని, 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ చేస్తారంటూ అసత్య సందేశాలు పంపి గందగగోళం సృష్టిస్తున్నారు. ఒక నంబర్ ఇచ్చి కాల్ చేయాలని పేర్కొన్నారు.
అయితే, ఈ నకిలీ సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటి సందేశాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో పోస్టు పెట్టింది. ఇది ఫేక్ నోటీసు, బీఎస్ఎన్ఎల్ ఎపుడూ సిమ్ కేవైసీకి సంబంధించి ఎలాంటి నోటీసూ పంపించదు.
ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండండి అని సూచించింది. ఏదైనా వార్తను నమ్మడం, వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని ప్రజలను సూచించింది.