Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి రేటు జిగేల్.. తగ్గిన వెండి ధర

Written By ఠాగూర్
Updated: బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:56 IST)
దేశంలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. కానీ వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. సోమవారం దిగొచ్చిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది. నిజంగానే ఇది కొనుగోలుదార్లకు ఇది చెడువార్తే. బంగారం ధర పైకి చేరితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.47,460కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.43,500కు ఎగసింది.
 
వెండి రేటు నేలచూపులు చూసింది. ఏకంగా రూ.400 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.63,800కు తగ్గింది. వెండికొనే వారికి ఇది ఊరట కలిగించే అంశం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.16 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1775 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా పడిపోయింది. ఔన్స్‌కు 0.60 శాతం తగ్గుదలతో 22.47 డాలర్లకు క్షీణించింది. 

అన్నీ చూడండి

Jailer 2 Update: జైలర్ 2 ఫస్ట్ సింగిల్ తేదీని ప్రకటించిన సన్ పిక్చర్స్

అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ది రెడ్ బ్యాగ్ ఆకట్టుకుంటుంది : హరికృష్ణ సోమిశెట్టి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments