సంబంధిత వార్తలు
- అనంత్ కొత్త ఫ్యాకల్టీ, గ్రాడ్యుయేట్ హౌసింగ్ను ఆవిష్కరించిన శ్రీ అజయ్ పిరమల్
- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్య సాధనకు యూనివర్సిటీలకు చేయూతనిస్తున్న NIAT
- భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష రాసేవారు ఎదుర్కొంటున్న సవాళ్లు: పియర్సన్ నూతన అధ్యయనం
- క్రీడలు- కళలలో అపూర్వ గుర్తింపును పొందిన కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు
- సింపోజియం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు: ఏఐలో స్థిరత్వాన్ని అభివృద్ధి చేస్తోన్న కెఎల్హెచ్ బాచుపల్లి
శామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ 2025లో 20 వేల భారతీయ విద్యార్థులకు భవిష్యత్-టెక్ శిక్షణ
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, తన ప్రధాన CSR కార్యక్రమం శామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ విస్తరణను ప్రకటించింది. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ప్రభుత్వ దృష్టికి మద్దతుగా, భారత యువతను భవిష్యత్కు సిద్ధమైన నైపుణ్యాలతో శక్తివంతం చేయాలనే తన నిబద్ధతను ఈ విస్తరణ మరల రుజువు చేస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమం 2024లో నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమై, ఈ సంవత్సరం 10 రాష్ట్రాలకు విస్తరించబడుతోంది. 2025 నాటికి 20,000 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), బిగ్ డేటా, కోడింగ్, ప్రోగ్రామింగ్ వంటి భవిష్యత్-టెక్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఇది గత సంవత్సరం 3,500 మంది విద్యార్థులకు ఇచ్చిన శిక్షణతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. సాంకేతిక శిక్షణతో పాటు, విద్యార్థులు కార్యాలయ సంసిద్ధతను పెంపొందించడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్లో మార్గదర్శకత్వం పొందుతారు. అదనంగా, అర్హత కలిగిన అభ్యర్థులకు సంబంధిత పరిశ్రమల్లో ప్లేస్మెంట్ సహాయాన్ని కూడా అందించనున్నారు.
భారతదేశ వృద్ధి ప్రయాణంలో దీర్ఘకాల భాగస్వామిగా ఉండటం శామ్సంగ్ గర్వంగా ఉంది. భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా ఉన్న శామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్, యువతకు అవకాశాలను విస్తరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే మా భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా భారత యువతను భవిష్యత్తుకు సిద్ధమైన నైపుణ్యాలతో తయారుచేస్తూ, వారు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడానికి, దేశ పురోగతిని ముందుకు నడిపించడానికి సహాయపడుతున్నాము. నైపుణ్యం, ఉపాధి అవకాశాలకు ప్రాప్యతను విస్తరించడంలో, ముఖ్యంగా తక్కువ అవకాశాలున్న వర్గాలకు చెందిన విద్యార్థులకు, మేము కట్టుబడి ఉన్నాము. ఈ విధంగా డిజిటల్-శక్తివంతమైన భారతదేశం పట్ల ప్రభుత్వ దృష్టికి మద్దతు ఇస్తున్నాము, అని మిస్టర్. జె.బి. పార్క్, ప్రెసిడెంట్- CEO, శామ్సంగ్ నైరుతి ఏషియా అన్నారు.
ప్రమాణ విస్తరణ, చేరికపై వ్యూహాత్మక కేంద్రీకరణ
ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ అందించడానికి, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. అదనంగా, టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్తో రెండవ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, ఈ కార్యక్రమం తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో మరో 10,000 మంది విద్యార్థులకు విస్తరించబడనుంది.
ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది, ప్రతి రాష్ట్రం నుండి 5,000 మంది విద్యార్థులు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందనున్నారు. పట్టణ, పాక్షిక-పట్టణ ప్రాంతాలను చేరుకోవడం ద్వారా భవిష్యత్-సాంకేతిక నైపుణ్యాలకు ప్రాప్యతను ప్రజాస్వామ్యీకరించడమే ఈ చొరవ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనలో తక్కువ అవకాశాలు కలిగిన కమ్యూనిటీలు వెనుకబడకుండా చూడటంపై ప్రత్యేక శ్రద్ధ చూపబడుతోంది.
ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ రెండూ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ఆమోదిత సంస్థలు. తమ గుర్తింపు పొందిన శిక్షణా భాగస్వాములు, కేంద్రాల నెట్వర్క్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నాయి. 2022లో భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుండి, శామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఇప్పటికే 6,500 మంది విద్యార్థులకు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణను అందించింది.
