Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా దూకుడు : కొత్తగా 704 పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 30 జూన్ 2020 (13:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా మంగళవారం కూడా కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,114 శాంపిళ్లను పరీక్షించగా మరో 704 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
వారిలో 648 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,202 అని పేర్కొంది. 
 
ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,770 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 187కి చేరింది.
 
జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపురం 1571, చిత్తూరు 1054, ఈస్ట్ గోదావరి 1129, గుంటూరు 1349, కడప 940, కృష్ణ 1467, కర్నూలు 1955, నెల్లూరు 608, ప్రకాశం 370, శ్రీకాకుళం 63, విశాఖపట్టణం 542, విజయనగరం 159, వెస్ట్ గోదావరి 995 చొప్పున కేసులు నమోదైవున్నాయి. 

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments