యాచ‌కులు, బైరాగుల‌కు క‌రోనా వాక్సినేష‌న్!

గురువారం, 5 ఆగస్టు 2021 (14:30 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గోదావారి తీరంలో యాచ‌కులు, బైరాగులు ఎక్క‌వ‌గా సంచ‌రిస్తుంటారు. వీరికి ఎలాంటి ఆధార్ కార్డులు, ఆధారం లేని స్థితి. ఇలాంటి వారికి క‌రోనా వ్యాక్సిన్ వేయించే ప‌నిపెట్టుకుంది... రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి.
 
రాజమహేంద్రవరంలోని నిరాశ్రయులు, యాచకులు, సాధువులకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ఉచితంగా రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమీ జీవ కారుణ్య సంఘం వేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్. వైద్య అధికారిని విన్నూత్న ఇందులో పాల్గొన్నారు.

టీకే విశ్వేశ్వరరెడ్డి నిరాశ్రయులు, యాచకులు, సాధువులకు కోవిడ్ టీకాలు వేయించడం గొప్ప విశేషంగా కొనియాడారు. ఇప్పుడు వేయించుకున్న అనాధలకు యాచకులకు సాధువులకు రెండు నెలల పోయిన తరువాత రెండవ డోసు వ్యాక్సినేషన్ వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ లాయర్ మద్దూరి శివ సుబ్బారావు వ్యాక్సినేషన్ వేయించుకున్న అనాధలకు, యాచకులకు, సాధువులకు మాస్కులు పంచిపెట్టారు.

గోదావరి ఒడ్డున నిరాశ్రయులు, యాచకులు, సాధువులను ఒక చోటకు చేర్చి కోవిడ్ వాక్సినేషన్ వేయించడం మానవతా విలువలకు అద్దం పట్టిందని అన్నారు. రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఏ విధమైన ఆధారం లేనివారికి  కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తే వ్యాప్తి జరగకుండా ఉంటుంది అని అన్నారు.

వ్యాక్సినేషన్ అనంతరం అంద‌రికీ గోదావరి పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ స్వ‌రూప రెడ్డి భోజనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 120 మందికి యాచకులకు ఉచిత వాక్సినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో లో కళాశాల ఎన్. ఎస్. పివో లు ప్రవీణ, ప్రసాద్, కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments