శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (10:00 IST)

దేశంలో తగ్గుతున్న కోవిడ్ కేసులు.. పెరుగుతున్న రికవరీలు

దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 12రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

భారత్‌లో కొత్తగా 67వేల 208 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 330 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా లక్షా 3వేల 570 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 84లక్షల 91వేల 670 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8లక్షల 26వేల 740 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 97లక్షల 303కి చేరాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా 26,55,19,251 డోసులు వేసినట్లు వివరించింది. 
 
నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.