Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో రికార్డు సృష్టిస్తున్న కరోనా - కొత్తగా 17 వేల కేసులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 26 జూన్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ మహమ్మారి దేశంలో రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. గురువారం 16 వేల కేసులు నమోదు కాగా శుక్రవారం ఈ సంఖ్య 17 వేలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,296 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఒకేరోజు 407 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరగా, మృతుల సంఖ్య 17,296కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,89,463 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,85,637 మంది బాధితులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. 
 
దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 4841 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తంగా 1,47,741 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 6,931 మంది బాధితులు మృతిచెందగా, 77,453 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 63,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇక రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 73,780కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2429 మంది బాధితులు మృతి చెందారు. దేశ రాజధానిలో గురువారం ఒక్కరోజే 3390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 64 మంది మరణించారు. 
 
దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటివరకు 70,977 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 911 మంది మృతిచెందారు. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 29,520 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1753 మంది మరణించారు.  

అన్నీ చూడండి

Rashmika Mandanna: ఆనంద్ సినిమా గురించే ఆలోచిస్తాడు, కష్టపడుతుంటాడు, ఎపిక్ చూస్తా : రష్మిక మందన్నా

Chandra Siddharth : బ్రయిన్ మ్యాపింగ్.. కథాంశంగా చంద్ర సిద్ధార్థ్ చిత్రం ‘ఈ పాట కోరినవారు.....

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

తర్వాతి కథనం
Show comments