సంబంధిత వార్తలు
- రష్యాలో ఉన్న వ్యక్తికి భారత్లోని టీకాల కొరత తెలిసింది... కానీ కేంద్రానికి తెలియదా?
- పెట్రోల్ ధరల పెరుగుదలకు అడ్డేలేదా?
- దేశంలో అత్యంత కారుచౌక కరోనా వ్యాక్సిన్ ఏది?
- #JuhiChawlaకు రూ. 20లక్షల జరిమానా.. 5జీ నెట్వర్క్పై టైమ్ వేస్ట్... అంతా పబ్లిసిటీ కోసమే!
- వ్యాక్సిన్ తో కరోనాను తరిమేద్దాంః వరలక్ష్మీ శరత్కుమార్
కోవాగ్జిన్ నో స్టాక్.. ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు..18-44 ఏళ్ళ మధ్య..?
కోవాగ్జిన్పై ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విధానంలో కొత్త పంథా అనుసరిస్తోంది. 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారిలో రెండో డోసు అవసరమైనవారికే కోవాగ్జిన్ టీకామందు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడత తీసుకోవలసినవారిని తిప్పి పంపివేయాలని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను, నర్సింగ్ హోమ్లను ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.
టీకా స్టాక్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా స్టాక్ లేదని, ఈ కారణంగా మొదటి డోసు తీసుకోగోరేవారికి ఛాన్స్ లేదని అంటున్నారు. ముఖ్యంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఓ వ్యూహాన్ని పాటించాలని ఢిల్లీ హైకోర్టు గతవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ వ్యాక్సినేషన్ విధానంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ సూచన చేసింది.
తర్వాతి కథనం
