1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మార్చి 2015 (19:36 IST)

వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్: సిడ్నీకి వెళ్లిన అనుష్క శర్మ.. కోహ్లీ కోసం..

ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠను రేపుతున్న సమయంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సిడ్నీ చేరుకుంది. మార్చి 26వ తేదీన టీమిండియా సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. తన చెలికాడు విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్‌ను కనులారా తిలకించేందుకే అక్కడకు వెళ్ళింది.
 
అనుష్కను తను ప్రేమిస్తున్నట్టుగా కొద్ది రోజుల క్రితం విరాట్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎన్‌హెచ్ 10‌లో అనుష్క నటనను కూడా మెచ్చుకున్నాడు. తనను ప్రశంసించినందుకు అనుష్క కృతజ్ఞతలు తెలుపుతూ కోహ్లీకి ట్వీట్ చేసింది.
 
ఇదిలావుంటే, జీవిత భాగస్వాములు, ప్రియురాళ్లతో కలిసే విషయంపై ఉన్న నిషేధాన్ని, టీమిండియా నాకౌట్‌కు అర్హత సాధించడంతో బీసీసీఐ ఎత్తివేసింది. దీంతో పెళ్లైన క్రికెటర్లు భార్యలతో, పెళ్లి కాని ప్రసాదులు ప్రియురాళ్లతో కలిసే అవకాశం చిక్కింది.
 
ఇప్పటికే కొందరి జీవిత భాగస్వాములు ఆస్ట్రేలియా చేరారు. తాజాగా నిన్న కోహ్లీ ప్రేయసి అనుష్క కూడా సిడ్నీ చేరుకుంది. ఆమెతో కలిసి కోహ్లీ నిన్న ఓ రెస్టారెంటుకు వెళ్లి డిన్నర్ కూడా చేశాడు. గురువారం మైదానంలో కోహ్లీ ఆడనున్న సెమీస్‌ను స్టాండ్స్ నుంచి అనుష్క వీక్షించనుంది.