శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (18:42 IST)

ఆసియా క్రికెట్ కప్ : కోహ్లీకి విశ్రాంతి... రోహిత్ శర్మకు సారథ్యం

ఆసియా క్రికెట్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియాను ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో జట్టును ప్రకటించగా, రెగ్యులర్ కెప్

ఆసియా క్రికెట్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియాను ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో జట్టును ప్రకటించగా, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అలాగే, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధవాన్‌ను ఎంపిక చేశారు.
 
కాగా ఇటీవల యోయో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన అంబటి రాయుడు ఈ సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాక.. రాజస్థాన్‌కు చెందిన ఖలీల్ అహ్మద్‌కు తొలిసారి జట్టులో చోటుకల్పించారు. ఇంగ్లండ్‌ పర్యటనలో గాయపడిన భువనేశ్వర్ కుమార్ ఈ మధ్యే కోలుకోవడంతో అతన్ని కూడా జట్టులోకి తీసుకున్నారు. 
 
దీనిపై చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందిస్తూ, 'గత కొద్దికాలంగా కోహ్లీ మూడు ఫార్మాట్లు విశ్రాంతి లేకుండా ఆడుతున్నాడు. అందుకే అతనిపై పడుతున్న వర్క్‌లోడ్‌ని దృష్టిలో పెట్టుకొని అతనికి విశ్రాంతి కల్పించాం. భవిష్యత్తు టోర్నీలు కూడా దృష్టిలో పెట్టుకొని అతనికి విశ్రాంతి ఇచ్చాం' అని చెప్పారు. 
 
భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ(కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌, హార్థిక్ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజవేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌.