1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (09:50 IST)

బాబ్బాబూ.. నీకు దండం పెడతాం... ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండంటి... బిగ్ బికి ఫ్యాన్స్ వినతి

amitabh
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానులు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీన ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంకు రావొద్దంటూ కోరుకుంటున్నారు. బాబ్బాబూ.. మీకు దండం పెడతాం.. ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండండి అంటూ వారు ప్రాధేయపడుతున్నారు. దీంతో ఇపుడు ఏం చేయాలన్న డైలామాలో బిగ్ బి పడిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 15వ తేదీన ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడగా, భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, తాను మ్యాచ్ చూడకపోతే మనం గెలుస్తామని చెప్పారు. ఇది కాస్త వైరల్ అయింది. దీంతో అభిమానులు పై విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ ఒక్కసారి జట్టు కోసం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యర్థనలపై అమితాబ్ స్పందించారు. ఈ మ్యాచ్‌కు వెళ్ళాలా? వద్దా? అని ఆలోచనలో పడిపోయినట్టు చెప్పారు. ఇదిలావుంటే, భారత క్రికెట్ జట్టు ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచ విజేతగా నిలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అందుకే ఈ మ్యాచ్‌కు అమితాబ్ దూరంగా ఉండాలన్నది వారి ప్రధానకోరికగా ఉంది.