సంబంధిత వార్తలు
- బోగస్ పేరుతో రేషన్ కార్డులపై వేటు : జగన్ సర్కారు ప్లాన్..
- మళ్లీ వెనక్కి తగ్గిన "డిస్కోరాజా"... జనవరి 24న వస్తాడట...
- తాండవం చేస్తున్న నిరుద్యోగం.. 45 ఏళ్లలో ఈ పరిస్థితి లేదు.. ఒప్పేసుకున్న ఎన్డీయే
- ఉద్యోగులకు షాకిచ్చిన జియో.. ఐదువేల మందిపై వేటు..
- 28-01-2019 మీ రాశి ఫలితాలు... అవి గోప్యంగా వుంచడం మంచిది...
జనవరి వరకు ఆగండి.. అప్పటివరకు ఏమీ అడగొద్దు.. ధోనీ
ఎంఎస్ ధోనీ తన భవితవ్యంపై నోరు విప్పాడు. వరల్డ్ కప్ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టని రాంచీ డైనమైట్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడా? అనే ప్రచారం సాగుతున్న తరుణంలో వచ్చే ఏడాది జనవరి వరకు తనను ఏమీ అడగొద్దని చెప్పేశాడు. అంతవరకు ఆగండి అంటూ అందరి నోళ్లు మూయించాడు. బుధవారం ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా ధోనీ మాట్లాడాడు.
జనవరి నెలను డెడ్లైన్గా పెట్టుకున్న ధోనీ.. ఆ తర్వాతే తన క్రికెట్ కెరీర్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రపంచకప్లో న్యూజిలాండ్తో సెమీస్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. విండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లతో జరిగిన సిరీస్లకు ధోనీ దూరంగా ఉన్నాడు. అసలు సెలక్షన్ కమిటీకి కూడా ధోని అందుబాటులో లేకుండా పోయిన సంగతి తెలిసిందే.
తర్వాతి కథనం
