1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Sunil Gavaskar Drops Brutal Truth on Non-Experts

కొత్త రంజీ ట్రోఫీ షెడ్యూల్‌పై బీసీసీఐని నిలదీసిన సునీల్ గవాస్కర్

sunil gawaskar
కొత్త రంజీ ట్రోఫీ షెడ్యూల్‌పై మాజీ స్టార్ ప్లేయర్, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐని ప్రశ్నించారు. టోర్నమెంట్‌ను రెండు దశలుగా విభజించాలన్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత దేశీయ సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల మధ్యలో రంజీ ట్రోఫీని ఆడనున్నారు. ఇది ఆటగాళ్ల లయను ప్రభావితం చేస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఒక వైట్ బాల్ పోటీ కోసం భారతదేశపు ప్రధాన రెడ్-బాల్ టోర్నమెంట్‌కు ఎందుకు అంతరాయం కలిగించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
 
"ఒక వైట్ బాల్ టోర్నమెంట్‌కు చోటు కల్పించడానికి ఒక టోర్నమెంట్‌కు ఎలా అంతరాయం కలిగించగలరు?" అని గవాస్కర్ అడిగారు. సెప్టెంబర్‌లో దేశీయ సీజన్ ప్రారంభంలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆడవచ్చని కూడా గవాస్కర్ సూచించారు.
 
గవాస్కర్ ప్రకారం, రంజీ ట్రోఫీ మాదిరిగానే లీగ్, క్వార్టర్ ఫైనల్ దశలను పూర్తి చేసి, విరామం తీసుకోవడం ద్వారా ఎస్ఎమ్ఏటి కూడా అదే ఫార్మాట్‌ను అనుసరించవచ్చు. ఆ తర్వాత సెమీ ఫైనల్స్, ఫైనల్ ఆడవచ్చు. ఇలా చేయడం వల్ల టోర్నమెంట్ ఊపు దెబ్బతినకుండా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
 
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుతం దేశీయ క్రికెట్‌ను నిర్వహిస్తున్న తీరును కూడా ప్రశ్నించారు. పాత బీసీసీఐలో మాజీ ఆటగాళ్లు, అంపైర్లు, అనుభవజ్ఞులైన నిర్వాహకులతో కూడిన ప్రత్యేక టెక్నికల్, ఫిక్చర్స్ కమిటీలు ఉండేవని గవాస్కర్ గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థను తిరిగి తీసుకురావడం షెడ్యూలింగ్ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
దులీప్ ట్రోఫీని గెలుచుకున్న ఈస్ట్ జోన్.. ఇషాన్, వైభవ్‌ల డ్యాన్స్‌.. 13 ఏళ్ల తర్వాత? (video)