1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2014 (15:08 IST)

హ్యూస్ మృతి బాధాకరమే.. బౌన్సర్ల భయపెట్టండి: రికీ పాంటింగ్

ఫిలిప్ హ్యూస్ అకాల మరణం బాధాకరమైనప్పటికీ, గతాన్ని మరచి ముందుకు సాగాలని, భీకర బౌన్లర్లతో ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. భీకర బౌన్సర్ల ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని పాంటింగ్ సూచించాడు. జాన్సన్ దూకుడుగా ఆడాలని ఆయన సూచించాడు. 
 
తొలి బంతినే బౌన్సర్‌గా వేస్తే చూడాలని ఉందన్నాడు. ఆటగాళ్ళు గాయపడాలని తానూ కోరుకోవడం లేదని, అయితే బౌన్సర్‌లు లేకుంటే ఆటలో మజా ఉండదని రికీ పాంటింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. మిచెల్ జాన్సన్ మొదటి బంతే బౌన్సర్‌గా చూడాలనుకుంటున్నట్లు పాంటింగ్ తెలిపాడు.