శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (19:08 IST)

ముంబైలో దారుణం : మాజీ ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు (Video)

murder
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన మాజీ ప్రియురాలిని ప్రియుడు నడి రోడ్డుపై కొట్టి చంపేశాడు. అదీ కూడా స్పానర్‌తో ఈ దాడికి దాడిచేశారు. ఆ యువతి బోరున విలపిస్తున్నప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు విడిచేంతవరకు కొట్టాడు. ఈ దారుణం మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అత్యంత బిజీగా ఉండే ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ దారుణానికి పాల్పడిన యువకుడిని 20 యేళ్ల రోహిత్ యాదవ్‌గా గుర్తించగా, యువతిని ఆర్తీ యాదవ్‌గా గుర్తించారు. దీనిపై ముంబై పోలీసులు స్పందించి రోహిత్ యాదవ్‌పై హత్యా కేసును నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. మాజీ ప్రియురాలిపై విచక్షణా రహితంగా రోహిత్ యాదవ్ దాడి చేస్తుంటే అనేక మంది పాదాచారాలు ఒక్కరు కూడా అడ్డుకోకుండా నిశ్చేష్టులై చూస్తూ నిల్చొండిపోయారు. అయితే, ఒక యువకుడు మాత్రం రోహిత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా రోహిత్ ఆగలేదు.