1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 మే 2024 (08:24 IST)

14 ఏళ్ల బాలికపై అడవిలో పది మంది మైనర్లు సామూహిక అత్యాచారం

crime scene
బెల్జియంలోని వెస్ట్ ఫ్లాండర్స్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో 14 ఏళ్ల బాలికపై పది మంది మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం పది మంది నిందితులు 11-16 సంవత్సరాల మధ్య ఉన్నవారే. ఈ కేసు ఆ దేశంలో సంచలనం సృష్టించింది. 
 
కోర్ట్రిజ్క్ నగరంలో, అమ్మాయిని తన ప్రియుడు అడవిలోని ఓ ఇంటికి తీసుకొచ్చాడు. ఈస్టర్ సెలవుల సందర్భంగా ఏప్రిల్ 2 - ఏప్రిల్ 6 మధ్య మూడు సందర్భాలలో పది మంది మైనర్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
ఈ ఘటనకు పాల్పడిన మైనర్లను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఆపై జువైనల్ కోర్టు చర్యలు చేపట్టింది. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆమెకు చికిత్స కోసం వైద్యుల పర్యవేక్షణలో వుందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.