1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 జులై 2022 (11:54 IST)

బహిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

rape
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు మాత్రం మాటరడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ద్వసరై గ్రామంలో మరో దారుణం వెలుగుచూసింది.

 
సాయంత్రం వేళ 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికలు బహిర్భూమికి వెళ్లారు. సమీపంలో పూటుగా మద్యం సేవిస్తున్న ఐదుగురు యువకులు వీరిని గమనించి కిడ్నాప్ చేసి కొంతదూరు తీసుకుని వెళ్లారు. అక్కడ ఇద్దరిపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

 
ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల తండ్రి జూన్ 30న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసారు.