1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (10:25 IST)

రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదనీ భార్యను చంపిన భర్త ... ఎక్కడ?

murder
రెండోసారి శృంగారానికి అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. కట్టుకున్న భార్యను క్షణికావేశంలో గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని తాము ఉండే ప్రాంతానికి 50 కిలోమీటర్ల అవతల అడివిలో పడేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోజీ జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమ్రోజీ జిల్లాకు చెందిన మహ్మద్ అన్వర్ అనే వ్యక్తి బేకరీ షాపును నిర్వహిస్తున్నాడు. ఈయనకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా, భార్య రుక్షత్ (30)తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
ఆ రోజు రాత్రి భార్యతో ఒక్కసారి ఏకాంతంగా గడిపాడు. ఆ తర్వా మరోమారు సెక్స్ చేసుకుందామని అన్వర్ కోరగా అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో అన్వర్‌కు పట్టరాని కోపం వచ్చింది. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. తర్వాత భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి దూరంగా పడేసి తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
ఇంతలో రుక్షత్ మృతదేహం కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహానికి శవపరీక్షలు చేశారు. ఇందులో గొంతునులిమి హత్య చేసినట్టు తేలింది. దీంతో అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లిడంచారు. తన భార్య రెండోసారి శృంగారానికి అంగీకరించకపోవడంతో క్షణికావేశంలో చంపేశానని చెప్పాడు.