సంబంధిత వార్తలు
- నీరజ్ చోప్రా- మనుబాకర్ ప్రేమలో పడ్డారా? ఆ వీడియో వైరల్
- ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేస్తాం.."ఆడుదాం ఆంధ్రా" పేరుతో..?
- పారాథైరాయిడ్ క్యాన్సర్కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స
- తల్లిదండ్రులు పెళ్లి చేసి పెట్టలేదు.. వాగులో దూకిన వ్యక్తి
- ఆగస్టులో తిరుమలలో రెండుసార్లు గరుడ సేవ.. నవ దంపతులు దర్శించుకుంటే?
విజయవాడ నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమజంట, ఎక్కడ చిక్కారంటే?
విజయవాడలోని భవానీపురంకి చెందిన ప్రేమికులు ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయిన జంటను తిరుపతిలోని తిరుచానూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురంకి చెందిన అలేఖ్య రెండు రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అలేఖ్య తిరుపతి తిరుచానూరులో వున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో పోలీసులు ప్రేమికులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా తామిద్దరం గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామనీ, మేజర్లమైన తామిద్దరం ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలియజేసారు. తమకు పోలీసులు రక్షణ కల్పించాలంటూ వారు విజ్ఞప్తి చేసారు. కాగా వీరిద్దర్ని భవానీపురం పోలీసు స్టేషనులో అప్పగించనున్నట్లు తిరుచానూరు సీఐ వెల్లడించారు.
