1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (11:58 IST)

యూపీలో మరో నిర్భయ ఘటన : కారులో యువతిపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న కారులో ఓ యువతిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఎస్.ఐ. ఉద్యోగం నిర్వహించిన రాత పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోసికల పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడుని అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. బాధిత యువతికి ఫేస్‌బుక్ ద్వారా హర్యానా రాష్ట్రంలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్ళ ఫేస్‌బుక్ పరిచయం తర్వాత ఫోన్లు నంబర్లు ఇచ్చిపుచ్చున్నారు. పిమ్మట ఫోనులో తరచూ మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో ఇటీవల ఎస్ఐ ఉద్యోగాల కోసం ఆగ్రాలో జరిగిన రాతపరీక్షకు వెళుతున్నట్టు తేజ్‌వీర్‌కు యువతి చెప్పింది. 
 
అంతే.. ఇదే అదనుగా భావించిన తేజ్‌వీర్ తాను వస్తానని చెప్పి ఓ కారులో తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె వద్దకు బయలుదేరారు. రాత పరీక్ష పూర్తయిన తర్వాత ఆమె వద్దని ఎంతగానో వారించినప్పటికీ ఇంటి వద్ద దింపుతామని చెప్పిన ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ యువతికి మత్తు మందిచ్చి కారులోనే అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగికదాడి చేయించాడు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకోగానే ఆగ్రా - ఢిల్లీ జాతీయ రహదారి పక్కన పొలాల్లో వదిలేసి హర్యానాకు వెళ్లిపోయారు. రోడ్డుపక్కన పడివున్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం వేశారు. 
 
దీంతో అక్కడకు చేరుకుని పోలీసులు ఆ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అలాగే, నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.