Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స : ఏపీ సీఎం జగన్

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి నగదు రహిత చికిత్సను అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన రహదారి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుని, వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 
 
ముఖ్యంగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకునేందుకు వీలుగా విశాఖలో రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారికి అండగా నిలబడటమే కాకుండా క్షతగాత్రులకు నగదు రహిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments