1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (19:37 IST)

ఏపీలో కరోనా తగ్గుముఖం.. రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేత.. సీఎం జగన్

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో  రాత్రి వేళ ఉన్న కర్ఫ్యూ ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం జగన్.  కరోనా పరిస్థితిపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళ ఉన్న కర్ఫ్యూ ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
 
అయితే.. మాస్క్ కంపల్సరీ ధరించే నిబంధన, మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సమావేశం నిర్ణయించింది. ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్ ఆదేశించారు. 
 
లక్షణాలు ఉన్న వారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తి చేయాలని, సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు సీఎం జగన్.  
 
మరోవైపు…ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. మరొకరు కరోనాతో మృతి చెందారు.