శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (10:02 IST)

దీపావళి రోజున లక్ష్మీపూజ.. పాలు, నెయ్యిని మరవకండి.. సాయంత్రం 5.55 గంటల నుంచి..?

దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను తప్పకుండా ఆచరించాలి. ఆరోజు తప్పకుండా ధనలక్ష్మీ పూజ చేయాలి. దీపావళి రోజున దీపాలను వెలిగించడమే లక్ష్మీపూజలుగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం. దీపాల యొక్క సముదాయం పెట్టడమంటేనే లక్ష్మీదేవిని ఆ రూపంలో కూడా పూజించటమే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమయితే ఆ ఏడాది అంతా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
 
లక్ష్మీ అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు. ఏ రూపంలో అయినా ఆమె అనుగ్రహం ఉంటుంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీ దేవి పక్కన విష్ణుమూర్తిని కూడా ఉంచితేనే ఆమెకు పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుందని చెబుతారు. 
 
శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఈ పూజను చేయవచ్చు. సాయంత్రం 5.55 గంటల నుంచి 08.25 గంటల్లోపు ఈ పూజను ముగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయడం.. పాలలలో తేనెను కలిపి నైవేద్యంగా సమర్పించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.