మధుమేహం ఉన్నవారు పండ్లు తినాలా? వద్దా?

సోమవారం, 12 ఆగస్టు 2019 (15:10 IST)
మధుమేహం ఉన్నవారు పండ్లు తినాలా? వద్దా? అసలు నోటికి తీపి తగలకూడదని అంటారు. స్వీట్స్, తీయని పండ్లు మానెయ్యాలని అంటారు. కొందరేమో పండ్లు తినాలంటారు. అసలు ఏది కరెక్ట్? ఏ పండ్లు తీసుకోవాలి? 
 
నిజానికి పండ్లు నేచురల్ హీలర్స్. వీటిలోని అనేకానేక పోషకాలు ఆరోగ్యాన్నిస్తాయి. ఫైబర్, విటమిన్ బి, సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా పండ్లు తీసుకోవాలి. వీటిలోని షుగర్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని భయపడనవసరం లేదు. 
 
2-4 పోర్షన్ సైజు పండ్లు రోజు మొత్తంలో తీసుకోవచ్చు. పండ్లును భోజనంతో పాటు లేదా స్నాక్స్‌లాగా తీసుకోవచ్చు. ఒక పోర్షన్ అంటే ఒక మీడియం ఆపిల్ సైజు అన్నమాట.
 
ఏ పండు ఎంత తీసుకోవాలి?
మీడియం సైజు ఆపిల్, ఆరెంజ్, బత్తాయి, పీర్, జామ.
 
ఆల్‌బుఖరా-5, ద్రాక్ష-ఒక కప్పు, స్ట్రాబెర్రీలు- ఒక కప్పు, బొప్పాయి- రెండు కప్పులు. 

బాగా తియ్యని పండ్లయితే... అరటి పండు- చిన్నది, మామిడికాయ- 3 ముక్కలు, పుచ్చకాయ- 2 ముక్కలు, తర్బూజా- 2 పెద్ద ముక్కలు, సీతాఫలం- మీడియం సైజు, ఫైనాపిల్- 3 ముక్కలు.
 
ఎప్పుడు తినాలి?
ఉదయం అల్పాహారంతో ఒక పోర్షన్
మిడ్ మార్నింగ్ స్నాక్స్‌లో ఒక పోర్షన్
సాయంత్రం స్నాక్స్‌లో ఒక పోర్షన్ తీసుకుంటే రోజుకు కావాల్సిన పండు తిన్నట్టే.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments