ప్రతిరోజూ జున్ను తింటే ఏమవుతుంది..?

గురువారం, 7 మార్చి 2019 (10:14 IST)
పాలాధారిత ఉత్పత్తులు తీసుకుంటే బరువు పెరుగుతామన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ, ఈ అభిప్రాయం తప్పు అంటున్నారు పరిశోధకులు. పాలాధారిత ఉత్పత్తులు తీసుకున్నంత మాత్రాన బరువు పెరగరన్న విషయం పరిశోధనలో వెల్లడైంది. 18 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వయసు గల సుమారు 1500 మంది ఆహారపు అలవాట్ల మీద సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. 
 
వీరందరు సాధారణ బరువు కంటే ఎక్కువగా ఉన్నారు. వీరిలో సగంమందికి ప్రతిరోజూ పాలాధారిత ఉత్పత్తులతో పాటు జున్ను కొద్దిగా ఎక్కువగా ఇచ్చారు. మిగిలిన సగం మందికి వారు రోజూ తీసుకునే ఆహారాన్నే అందించారు. కొన్ని రోజుల తరువాత పాలాధారిత ఉత్పత్తులు, జున్ను తీసుకునేవారి బరువును, ఆరోగ్యాన్ని పరిశీలించారు. 
 
వీరిలో 75 శాతం మంది బరువు పెరగకపోగా కొద్దిగా బరువు తగ్గిన విషయాన్ని గుర్తించారు. అయితే జున్ను తీసుకోవడం వలనే బరువు తగ్గుతారా.. లేదా అని భయపడుతున్నారా.. వద్దూ వద్దూ.. బరువు తగ్గాలనుకుంటే మాత్రం జున్ను తీసుకోండి.. ఫలితం ఉంటుంది. లేదంటే మీ ఇష్టం. 
 
ప్రతిరోజూ జున్నుతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే బరువు తప్పక తగ్గుతారని పరిశోధనలో తేలింది. కనుక మీరు రోజూ తినే ఆహారంలో కొద్దిగా జున్ను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జున్నులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. అంతేకాదు.. శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. 

అన్నీ చూడండి

కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments