శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (13:02 IST)

ధనియాల కషాయంలో పాలు కలుపుకుని తాగితే? (video)

వంటింట్లో వుండే ధనియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అమోఘంగా వుంటాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. నిద్రలేమితో బాధపడేవారు ధనియాల కషాయం చేసుకొని, ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగిత నిద్ర బాగా పడుతుంది.
 
2. ధనియాల పొడిలో ఉప్పు కలుపుకుని రోజూ ఓ చెంచాడు తీసుకొంటే అజీర్తి బాధ తగ్గి ఆకలి బాగా అవుతుంది.
 
3. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది. మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
 
4. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే  పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గే అవకాశం ఉంది. 
 
5. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపు ఉబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.
 
6. షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుతాయి. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడంవల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.