ఆ సమస్య వున్నవారు ఇవన్నీ తీసుకుంటే మంచిది...

Written By సిహెచ్
Updated: సోమవారం, 8 అక్టోబరు 2018 (20:22 IST)
ప్రస్తుతకాలంలో తినే ఆహారం సరైనది కాకపోవడం, సమయానికి తినకపోవడం, మసాలా, నూనె పదార్దాలు లాంటివి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక మలబద్దక సమస్య తలెత్తుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు తోడ్పడే అవయవాలను జీర్ణావయవాలంటారు. ఇది సరిగ్గా పని చేయకపోతే మలబద్దకం, విరేచనాలు కలుగుతాయి. మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఆహార నియమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటంటో చూద్దాం.
 
1. తీసుకునే ఆహారంలో పీచు పదార్దాలు ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అంటే... ఆకుకూరలు, కూరగాయలు సమృద్దిగా తీసుకోవాలి.
2. క్యారెట్, దోస వంటి కూరగాయలను తాజా పండ్లను పచ్చిగానే తినడం వల్ల ఎక్కువ పీచు పదార్దాన్ని ఆహారం నుండి పొందవచ్చు.
3. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది.
4. పండ్ల రసాలు త్రాగడం తగ్గించి, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. బత్తాయి తినేటప్పుడు తెలుపు పొరతోనే తొనలు తినాలి. 
5. కాఫీ, టీ, కారం, మసాలా దినుసులు, వేపుడు కూరలు ఆహారంలో బాగా తగ్గించాలి.
6. ముడిధాన్యాలు, ముడిపప్పులను వాడాలి. మొలకెత్తించిన ముడిపప్పులు శ్రేష్టమైనవి. జల్లించకుండా తవుడు కొద్దిగా గల గోధుమ పిండి లేక జొన్న పిండిని రొట్టెలు చేసుకుని తినడం వల్ల మలబద్దక సమస్యను తగ్గించుకోవచ్చు.
7. వీటితో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. వేకువ జామున ఒక గంట నడక చాలా మంచిది.

అన్నీ చూడండి

ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ

విద్యార్థులపై పల్లెట్ గన్‌లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments