గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 24 మార్చి 2023 (23:57 IST)

షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పదార్థాలను తీసుకుంటే ఏమవుతుంది?

Neem sticks
ఇపుడు ప్రపంచంలో అధికులు ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్య మధుమేహం. జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణంగా మధుమేహం తలెత్తుతుంది. దీన్ని అదుపు చేసేందుకు తగు పదార్థాలను తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల మరొకటి మెంతులు, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
 
మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి. మధుమేహాన్ని కలబంద అడ్డుకుంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
 
షుగర్ వ్యాధిని అడ్డుకోవడంలో సాయపడే మరో చక్కని దినుసు దాల్చిన చెక్క.
 
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల శక్తి కాకర కాయకు వుంది.