సంబంధిత వార్తలు
- Airtel Free pack, 5.5 కోట్ల మందికి రూ.49 రీఛార్జ్ ఉచితం
- గుట్కా వాహనంపై పోలీసుల దాడి: వాహనం సహా రూ.1.50 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లు స్వాధీనం
- రఘురామకృష్ణరాజు, టీవీ5 ఏబీఎన్లపై కేసు నమోదు: సీఐడీ
- ముంచుకొస్తున్న తౌక్టే: 175 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాయలసీమలో వర్షాలు
- 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా జ్వరపీడితుల సర్వే: అనిల్కుమార్ సింఘాల్
నేపాల్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత....
కాట్మాండు: నేపాల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో నమోదైనట్లు నేపాల్ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. నేపాల్ రాజధాని నగరం కాట్మాండుకు 115 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం నిక్షిప్తమైనట్లు తెలిపింది.
ఉదయం 5:42 గంటల సమయంలో లాంజంగ్ జిల్లాలోని భుల్భూలే వద్ద భూమి కంపించినట్లు భూకంప పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లోక్బీజయ్ తెలిపారు. ఈ భూప్రకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాట్మాండు పరిసరాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
