1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 17 మే 2021 (11:08 IST)

గుట్కా వాహనంపై పోలీసుల దాడి: వాహనం సహా రూ.1.50 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లు స్వాధీనం

తిరుపతి: గుట్కా వాహనంపై దాడి చేసి వాహనంతో సహా రూ.1.5 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం కీలపూడి సమీపంలో చోటు చేసుకుంది. హాన్స్ రవాణా చేస్తున్న మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

పిచ్చాటూరు ట్రైన్ ఎస్ ఐ పీవీ మోహన్ కథనం మేరకు పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు హాన్స్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పుత్తూరు రూరల్ సిఐ ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎస్ ఐ పి వి మోహన్ తన సిబ్బందితో కలిసి కీలపూడి సమీపంలో మాటు వేశారు.

అనుకున్న ఈ విధంగా సాయంత్రం 3.30 గంటలకు గుట్కా వాహనం పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు రావడాన్ని గమనించారు. కీల పూడి వద్ద వాహనాన్ని అడ్డుకుని పరిశీలించగా అందులో రూ.1.50 లక్షలు విలువ చేసే హాన్స్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనంలోని మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ లో మురళి, వినోద్, విజయ్ శేఖర్ పాల్గొన్నారు.