శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (10:06 IST)

1,616 సిరంజీలను వాడి.. వీర్య కణాల్ని గర్భంలోకి పంపారు.. పాప పుట్టింది..

ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధ

ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు. 
 
ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది. దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, ఆ మహిళా జంటలో పాట్రీసియా అనే మహిళ నెల తప్పింది. కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసింది. ఆపై ప్రసవించింది. 
 
మహిళా జంటకు సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను వైద్యులు పేర్చి మధ్యలో బిడ్డను ఫోటో తీశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా 1,616 సిరంజీలను వాడారు. ఈ సిరంజీల ద్వారా వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇలా తాను తల్లి కావాలనే కోరిక తీరిందని పాట్రీసియా తెలిపింది.