ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (23:06 IST)

హమాస్ ముందు ‘అల్-ఖైదా’ చిన్నబోయింది.. జో-బైడన్

joe biden
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ, లక్షలాది మంది నిరాశ్రయులవుతున్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరోసారి స్పందించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుందని చెబుతూనే, గాజాలో మానవతా సంక్షోభాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. 
 
మానవతా సంక్షోభం వారి మొదటి ప్రాధాన్యత. చాలా మంది పాలస్తీనియన్లకు హమాస్‌తో సంబంధం లేదని, అయితే భయంకరమైన దాడులకు గురవుతున్నారని బిడెన్ చెప్పారు. గాజాలో పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
యుద్ధ పరిణామాలను అమాయక ప్రజలు చవిచూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఫిలడెల్ఫియాలో మీడియాతో మాట్లాడారు ఇజ్రాయెల్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్న అమెరికా వైఖరిని బిడెన్ మరోసారి స్పష్టం చేశారు. 
 
ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపిన భయానక దాడులను ఆయన నిజంగా క్రూరమైన దాడులుగా అభివర్ణించారు. హమాస్ ముందు ‘అల్-ఖైదా’ చిన్నబోయిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్డాన్, ఇతర అరబ్ దేశాల ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితితో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి తమ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించాయి. 
 
హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న అమెరికన్ల కుటుంబ సభ్యులతో తాను మాట్లాడినట్లు బిడెన్ వివరించారు. తమ ఆత్మీయుల కోసం కుటుంబ సభ్యులు ఎంతగా ఆందోళన చెందుతున్నారో తెలుసునని చెప్పారు. 
 
అమెరికన్లను క్షేమంగా స్వదేశానికి చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్, భాగస్వామ్య దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.