అమెరికా హ్యూస్టన్ వర్శిటీలో తెలుగు విద్యార్థి మృతి!
అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్థి ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లాలోని కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సాయికృష్ణ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీలో చేరాడు.
ఆదివారం సాయికృష్ణ మృతదేహాన్ని పనామాలోని ఒక స్విమ్మింగ్ పూల్లో పోలీసులు కనుగొన్నారు. హ్యూస్టన్ నుంచి పనామాకు సాయికృష్ణ విహార యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్టు అతని స్నేహితులు చెపుతున్నారు. సాయికృష్ణ మృతిపై స్థానిక పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.