1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. At least 15 dead after multiple attacks near US Mexico border

మెక్సికోలో మారణహోమం ... కాల్పుల్లో 15 మంది మృత్యువాత

Mexico Border
మెక్సికో నగరంలో దుండగులు మరోమారు రెచ్చిపోయారు. కార్లలో నగరమంతా తిరుగుతూ మారణహోమం సృష్టించారు. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా - మెక్సికో సరిహద్దు రాష్ట్రమైన రేనోసోలో ఈ ఘటన జరిగింది. 
 
కొందరు దుండగులు కార్లలో తిరుగుతూ జనంపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. 
 
అతడి కారు డిక్కీలో బంధించిన ఇద్దరు మహిళలను రక్షించాయి. ఆ ఇద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాఫియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఇక్కడ గల్ఫ్ కార్టెల్ ముఠాలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వరుసదాడులు జరుగుతున్నాయి.
తర్వాతి కథనం
మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం