సోమవారం, 29 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:46 IST)

రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రాంతాల పేర్లు

indochina border
డ్రాగన్ కంట్రీ చైనా నిత్యం భారత్‌పై బుసలు కొడుతుంది. గతంలో పలుమార్లు కవ్వింపులకు పాల్పడిన చైనా ఇపుడు మరోమారు తన వక్రబుద్ధిని చూపింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనా... ఇపుడు ఆ ప్రాంతాల పేర్లను మారుస్తుంది. తాజాగా 11 ప్రాంతాల పేర్లను మార్చింది. చైనీస్, టిబెటిన్, షిన్యన్ అక్షరాలతో వీటి పేర్లను విడుదల చేసింది. ఇది మూడో విడత చర్యలో భాగంగా ఈ ప్రాంతాలను ఎంచుకుంది. 
 
చైనా మంత్రివర్గం జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా చైనీస్, టిబెటన్, షిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు భూభాగాలను, ఐదు పర్వత శిఖరాలను, రెండు నదులతో పాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 
 
2017లో తొలి విడతలో ఆరు ప్రాంతాలకు, 2021లో రెండో విడతలో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. ఇపుడు మూడో విడతగా 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టబోతున్నట్టు రాసుకొచ్చింది. పైగా, ఈ పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్య అని, అది చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ పేర్కొంది.