1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 20 జూన్ 2016 (14:36 IST)

సింహాలను ఫోటో తీయాలనుకున్నాడు.. కెమెరా కూడా ఫిక్స్ చేశాడు.. కానీ ఆడ సింహం ఏం చేసిందంటే?

కెన్యాలోని మసాయ్ మారా నేషనల్ పార్కులో.... అక్కడ విహరిస్తున్న సింహాలను చూసి ముచ్చటేసిన ఓ ఫోటోగ్రాఫర్ వాటిని ఫోటోలు తీయాలనుకున్నాడు. అందుకోసం లక్ష రూపాయల విలువ చేసే కెమెరాను ట్రై పాడ్‌కు అమర్చి దూరంగా న

కెన్యాలోని మసాయ్ మారా నేషనల్ పార్కులో.... అక్కడ విహరిస్తున్న సింహాలను చూసి ముచ్చటేసిన ఓ ఫోటోగ్రాఫర్ వాటిని ఫోటోలు తీయాలనుకున్నాడు. అందుకోసం లక్ష రూపాయల విలువ చేసే కెమెరాను ట్రై పాడ్‌కు అమర్చి దూరంగా నిలబడి రిమోట్ ద్వారా సింహాల ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఇంతలోనే కెమెరాను తదేకంగా చూసిన ఆడ సింహం ఒకటి దాని దగ్గరగా వచ్చింది. ఇదేదో వింత వస్తువనుకుందో.... తినడానికి ఏదో దొరికిందనుకుందో గానీ.... నోట్లో పెట్టుకుని పిప్పర్‌మెంట్ కొరికినట్టు కరకరా నమిలిపడేసింది. దీంతో లక్ష విలువచేసే కెమెరా దేనికి పనికిరాకుండా నుజ్జునుజ్జయింది. 
 
కెమెరాలోని లెన్స్, మొత్తం పరికరాలన్ని డ్యామేజ్ అయి కేవలం డబ్బా మాత్రమే చేతికి మిగిలింది. సింహాలను ముచ్చటపడి తన కెమెరాలో బంధించాలని ఆశపడిన థామస్ సేలిజ్ అనే ఫోటోగ్రాఫర్ ఆశ కలలాగే మిగిలిపోయింది. ఆ ఆడ సింహం కెమెరా దగ్గరకు రాగానే ఫోటోగ్రాఫ‌ర్‌కి గుండె ఆగినంత పనైంది. గంట సేపు ఆ కెమెరాతో కుస్తీ పట్టిన ఆడసింహం ఎట్టకేలకు దానిని చిత్తు చిత్తు చేసింది. చివరికి దాని రుచినచ్చలేదేమో గానీ కెమెరాను వదిలేసి పోయింది. ఆ సింహం అటు వెళ్లిందో లేదో... శకలంగా మిగిలిన డబ్బాతో బిక్క ముఖం వేసుకుని థామస్ అక్కడి నుండి బయటపడ్డాడు.