శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:38 IST)

గాజాలో బాంబుల మోత - ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసం

పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన గాజాలో మరోమారు బాంబుల మోత మోగుతోంది. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధ తయారీ, నిల్వ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 13 యేళ్ళ బాలికతో పాటు.. 24 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని గాజా అధికారులు వెల్లడించారు. 
 
దీంతో గాజాకు చెందిన అనేక మంది సరిహద్దు ప్రాంతంలో గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా దిగ్బంధాన్ని నిరసిస్తూ గాజా పౌరులు ఇజ్రాయెల్ దళాలపై రాళ్లు, పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో ఒక సరిహద్దు దళ విభాగం పోలీసు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ సేనలు గాజాలోని 4 ఆయుధ తయారీ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేశాయి.