కొలంబో ఎయిర్పోర్ట్లో ఎల్టీటీఈ మహిళా నేత అరెస్టు..!
శ్రీలంకలో నిషేధిత సంస్థ ఎల్టీటీఈకి చెందిన మహిళా నేతను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంకలో నిషేధిత సంస్థ ఎల్టీటీఈ సీ టైగర్స్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన బురుగేసు పహిరది. ఆమె సోమవారం ప్యారిస్కు వెళ్లేందుకుగాను కొలంబో ఎయిర్పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో ఆమెను గుర్తించిన టైస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(టీడీ) పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
2005లో ఫ్రాన్స్ వెళ్లిన ఆమె గత ఫిబ్రవరి 9న శ్రీలంకకు వచ్చారు. తాజాగా ఆమె ప్యారిస్కు వెళ్లేందుకు యత్నించగా టీడీ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. శ్రీలంకలో ప్రభుత్వం మారినప్పటికీ ఎల్టీటీఈపై నిషేధం మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.