శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (15:13 IST)

వర్జీనియాలో విద్వేష హత్య: రంజాన్ భోజనం చేసి బయటికొచ్చిన యువతిని.. బేస్‌బాల్ బ్యాట్‌తో?

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ముస్లిం దేశాలను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలపై దాడులు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. వలసలను అరికట్టడంతో పాటు ఉపాధి అవకాశాలను స్థానికులకు కల్పించేందుకు

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ముస్లిం దేశాలను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలపై దాడులు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. వలసలను అరికట్టడంతో పాటు ఉపాధి అవకాశాలను స్థానికులకు కల్పించేందుకు అవుట్ సోర్సింగ్‌కు ట్రంప్ సర్కారు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ భోజనం చేసి వస్తున్న యువతులపై ఉన్మాది దాడి చేసిన ఘటన అమెరికాలోని వర్జీనియాలో కలకలం సృష్టించింది. 
 
రంజాన్‌ నెలలో, రోజా పాటిస్తున్న ఆ యువతులు పొద్దున్నే హోటల్‌లో భోజనం చేశారు. బయటకు వస్తుండగానే, కారులో దూసుకొచ్చిన వచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడిచేశాడు. భయంతో మసీదులోకి పరుగులు తీసిన యువతులు.. తమలో ఒకరు తగ్గినట్లు గుర్తించారు. 
 
గంటలో స్నేహితురాలి మృతదేహాన్ని ఓ చెరువులో గుర్తించి, భీతిల్లిపోయారు. మృతురాలిని నబ్రా హుస్సేన్‌ (17)గా గుర్తించారు. ఆమెను ఒడ్డున బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై మత విద్వేష దాడిగా నమోదు చేసుకొన్న పోలీసులు, డార్విన్‌ మార్టినేజ్‌ టోరేజ్‌(22) అనే యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.