సంబంధిత వార్తలు
- మద్యం షాపుల దందాకు బ్రేక్.. ''లిక్కర్ ప్రైస్ యాప్'' ప్రారంభం
- పింక్ డ్రెస్సే దక్షిణాఫ్రికా విజయానికి కారణమా? సోషల్ మీడియాలో వైరల్
- 90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి: ఎంపీ గల్లా జయదేవ్
- ''అజ్ఞాతవాసి'' నిర్మాతలకు కొత్త చిక్కు.. లార్గో వించ్ ఏం చేశాడంటే?
- నా దృష్టిలో దర్శకుడే దేవుడు.. వారిని కొట్టడమా?: మోహన్ బాబు
దుబాయ్లో తొలి హిందూ దేవాలయం.. ప్రధాని మోదీ శంకుస్థాపన
దుబాయ్లో తొలి హిందూ దేవాలయానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దుబాయ్ పర్యటనలో వున్న ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 11) ఓపెరా హౌస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
దుబాయ్లో తొలి హిందూ దేవాలయానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దుబాయ్ పర్యటనలో వున్న ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 11) ఓపెరా హౌస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మొహ్మద్ బిన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగిన విషయమని తెలిపారు. భారత్-యూఏఈ మధ్య ఎప్పటి నుంటి మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు.
దుబాయ్లో హిందూ దేవాలయం నిర్మాణానికి రూ.125 కోట్ల భారతీయుల తరపున సౌదీ యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన 30 లక్షల మందికి స్వదేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషాన్నిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు అబుదాబి సైనికులకు మోదీ నివాళులు అర్పించారు.
