అమెరికా నుంచి భారత్‌కు కారులోనే వచ్చేశారు.. విమానం ఎక్కనేలేదు..

అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే

శుక్రవారం, 15 జూన్ 2018 (09:38 IST)
అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా భారత్ వెళ్లేందుకు రోడ్డుమార్గం ఎంచుకున్నారు.


విమానంలో వెళ్లేదానికంటే.. థ్రిల్ కోసం రాజేష్ కపాడియా, దర్శన్ అనే భారత జంట.. సొంత వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో నిత్యావసర వస్తువులు సిలిండర్లు ఇలా అన్నీ సిద్ధం చేసుకుని హోం రన్‌ పేరుతో అమెరికా నుంచి యాత్రను ప్రారంభించారు. యాత్రలో ప్రతి కదలికలను తమ కుటుంబసభ్యులకు తెలిసేలా జీపీఎస్‌ సిస్టమ్‌ను వాహనానికి అనుసంధానం చేశారు. అంతే అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. 
 
ఇండియాకు చేరే క్రమంలో చైనా మిలట్రీ విభాగం వీరి వాహనానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో 17వేల కిలోమీటర్లు చుట్టూ తిరిగి చివరికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ యాత్ర 61 రోజులు సాగిందని రాజేశ్‌, దర్శన్‌ల జంట వెల్లడించింది. 19 దేశాల్లో 37వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకున్నట్లు ఆ జంట చెప్పుకొచ్చింది.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments