1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Sonia Gandhi elected unopposed to Rajya Sabha from Rajasthan

రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టనున్న సోనియా గాంధీ

sonia gandhi
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభలో స్థానం సంపాదించిన రెండవ గాంధీ కుటుంబ సభ్యురాలిగా ఆమె నిలిచారు. రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని రాజ్యసభ నియోజకవర్గంలో ఆమె పోటీ చేశారు. 
 
సోనియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో సోనియా గాంధీ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభలో సభ్యునిగా ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభలో ప్రవేశించిన గాంధీ కుటుంబంలో 2వ సభ్యురాలు.
 
రాజస్థాన్‌లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో నోటిఫికేషన్ విడుదలైంది. భూపేంద్ర యాదవ్ (బిజెపి), మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్) పదవీకాలం ఏప్రిల్ 3వ తేదీతో ముగియనుండగా, బిజెపి సభ్యుడు కిరోడి లాల్ మీనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజ్యసభకు రాజీనామా చేశారు.
 
తర్వాతి కథనం
కుమార్తె కవితకు ఎంపీ టిక్కెట్ ఇచ్చేది లేదు.. కేసీఆర్ నిర్ణయం?