గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (12:03 IST)

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్.. ''కూల్'' పేరిట రూ.1099 రీఛార్జ్ చేసుకుంటే?

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పోటీ పడుతోంది. తాజాగా కొత్తగా ''కూల్'' అనే ఆఫర్‌ను బీఎస

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పోటీ పడుతోంది. తాజాగా కొత్తగా ''కూల్'' అనే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.
 
ఈ ఆఫర్‌తో ప్రీ-పెయిడ్ కస్టమర్లకు అపరిమిత డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్‌కు ఫ్రీ యాక్సెస్ అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కూల్ ఆఫర్ కింద ప్రయోజనాలు పొందాలనుకునే వినియోగదారులు రూ.1099తో రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.
 
తద్వారా 84 రోజుల పాటు కాలపరిమితిలో రోజుకు రూ.13తో అన్‌లిమిటెడ్, డేటా కాల్స్ అందుకోవచ్చు. దేశంలోని అన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.