శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (16:59 IST)

ఆపిల్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు...?

Iphone
స్మార్ట్ ఫోన్లు లేనిదే ప్రస్తుతం పూట గడవదు. వివిధ బ్రాండ్లలో గల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడం కోసం ఎగబడుతున్నారు. వాటి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఆపిల్‌ ఐఫోన్‌ను దక్కించుకోవడం మధ్యతరగతివారికి తీరని కల. అందుకే ఈ ఫోన్‌ కొత్త మోడల్‌ రిలీజ్‌ అయినప్పుడల్లా దానిపై జోకులు పేలుస్తారు మిడిల్‌క్లాస్‌ నెటిజన్లు. మన కిడ్నీ అమ్మితే ఈ ఫోన్‌ వస్తుంది అంటూ జోకులు చేసిన సందర్భాలు అనేకం. 
 
అయితే, చైనాకు చెందిన ఓ యువకుడు నిజంగానే ఐఫోన్‌కోసం తన కిడ్నీ అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో రెండు ఐఫోన్లు కొన్నాడు. కానీ.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచంపట్టాడు. అతడికి ఫోన్‌పై ఉన్న మక్కువ ప్రాణాల మీదకు వచ్చిందట. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్‌షాంగ్‌కు ఆపిల్‌ ఫోన్‌ కొనేందుకు తన మూత్రపిండాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. 
 
అనుకున్నదే తడువుగా తన కిడ్నీని బ్లాక్‌ మార్కెట్లో సుమారు 2, 73,273 అమెరికన్‌ డాలర్లకు అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్ 4, ఐప్యాడ్ 2ను కొనుగోలు చేశాడు. అయితే, కిడ్నీ అమ్మిన తొమ్మిది నెలల తర్వాత మరో మూత్రపిండంలో లోపం ఏర్పడింది. 
 
దీంతో డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అతడు బెడ్‌కే పరిమితం కానున్నాడు. ఇదిలా ఉండగా, వాంగ్‌ కిడ్నీ అమ్మిన విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఈ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.