శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (14:06 IST)

స్మార్ట్‌ఫోన్‌ను ఈ-షాపింగ్‌లో కొంటున్నారా?

ఇది ఈ-షాపింగ్ యుగం. కోరుకున్న వెరైటీ వస్తువులు ఒక్క క్లిక్‌తో ఇంటికొచ్చిపడుతున్నాయి. ఈ-ఆర్డర్లు చేసేవారిలో సింహభాగం యువతే. పండుగల సీజన్‌లో ఈజోరు అంతాఇంతాకాదు. మరి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటే వస్తువులన్నీ అసలైన ఉత్పత్తులేనా? అంటే కాదనే అంటోంది తాజా సర్వే. ఆన్‌లైన్‌‌లో కొనుగోలు చేసే ప్రతి ఐదు వస్తువుల్లో ఒకటి నకిలీదేనట. ఏంటి.. నమ్మడం లేదా? ఇది పచ్చినిజం. ఈ సర్వేలో వెల్లడైన వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రముఖ దినపత్రిక ఒకటి లోకల్ సర్కిల్స్‌తో కలిసి ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం. ఈ-టెయిలర్స్ విక్రయించే ప్రతి 5 వస్తువుల్లో ఒకటి నకిలీదని తేలింది. వీటిల్లో ఎక్కువగా యువత వాడే ఫ్రాగ్రెన్సెన్, కాస్మెటిక్స్, స్పోర్టింగ్ గూడ్స్, బ్యాగులు ఇత్యాది వస్తువులు ఉన్నాయి. ఇందుకోసం గత ఆరు నెలల పాటు సుమారు 30 వేల మందిని సర్వే చేశారు. 
 
'గత ఆరు నెలల్లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువుల్లో నకిలీ వస్తువులు అందుకున్నారా? అని అడిగితే 20 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. అయితే, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వస్తువుల్లో ఏది నకిలీయో... ఏది అసలో తెలియడం లేదన్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన వస్తువులు కొనేటపుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.