బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (15:03 IST)

మార్కెట్‌లో జియో ల్యాప్‌టాప్‌లు.. రిటైల్ కస్టమర్ల కోసం కాదు...

reliance jio laptop
అందరూ ఊహించినట్టుగానే రిలయన్స్ జియో ల్యాప్ టాప్‌ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. అయితే తొలుత ప్రచారం జరిగినట్టుగా రూ.15 వేల ధరకు మాత్రం కాదు. ఈ ల్యాప్ టాప్‌ ధరను రూ.19,500కు నిర్ణయించారు. అలాగే, వీటిని ఇప్పటివరకు రిటైల్ కస్టమర్లకు విక్రయించడం లేదు. కేవలం ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రం అందుబాటులోకి తెచ్చింది. అంటే ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం)పై విక్రయాలకు ఉంచింది. దీని ధర రూ.19,500గా ఖరారు చేశారు. 
 
జీఈఎం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసుగోలవు. మరి అందరికీ ఈ ల్యాప్ టాప్‌లు ఎపుడు అందుబాటులోకి వస్తాయన్నదానిపై క్లారిటీ లేదు. దీపావళి కానుకగా జియో ల్యాప్ టాప్ రిటైల్ కస్టమర్లకు అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. దీన్ని పూర్తిగా దేశీయంగానే తయారు చేసినట్టు జియో ప్రకటించింది.
 
కాగా, ఈ ల్యాప్ టాప్ 11.6 అంగుళాల హెచ్‌డీ‌ డిస్‌ప్లే, 1366/768 పిక్సల్స్ రిజల్యూషన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ అంటే ఈ ల్యాప్ టాప్ పవర్ ఫుల్ కాదని తెలుస్తోంది. 
 
పైగా ర్యామ్ సైజు కూడా తక్కువే. ధర తక్కువగా నిర్ణయించినప్పటికీ, ల్యాప్ టాప్ కాన్ఫిగరేషన్ ఆధారంగా చూస్తే ఇదేమీ చౌక కాదని తేలిపోతోంది. బేసిక్ అవసరాలకు, ఆన్‌లైన్ క్లాస్‌లకు ఇది బాగానే ఉపయోగపడుతుంది.