బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (22:56 IST)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో రిల‌య‌న్స్ జియో ట్రూ5జీ సేవ‌లు ప్రారంభం

Jio 5G
తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో 5జీ సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ద్వారా రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆవిష్క‌రించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, మౌలిక స‌దుపాయాలు, పెట్టుబ‌డులు, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రి గౌర‌వ శ్రీ గుడివాడ అమ‌ర్‌నాథ్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి గౌర‌వ శ్రీ కె.ఎస్. జ‌వ‌హ‌ర్ రెడ్డి విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో జియో ట్రూ 5జీ, జియో ట్రూ 5జీ ప‌వ‌ర్డ్ వై-ఫై సేవ‌ల‌ను ఆవిష్క‌రించారు.

 
జియో కమ్యూనిటీ క్లినిక్ మెడికల్ కిట్, విప్లవాత్మక ఏఆర్-వీఆర్ పరికరం జియో గ్లాస్ ద్వారా వైద్య‌రంగంలో 5జీ అద్భుత‌ ప్రయోజనాలను ఈ సంద‌ర్భంగా జియో ప్రదర్శించింది. ఈ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలలో అద్భుత మైన మార్పులు తీసుకొస్తాయి. ఈ సంద‌ర్భంగా గౌర‌వ ఐటీ శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమ‌ర్‌నాథ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్రూ 5 జి సేవలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.  ఇప్ప‌టికే ఉన్న‌ పెట్టుబడి రూ .26,000 కోట్లతో పాటు, అదనంగా ఆంధ్రప్రదేశ్ లో 5 జి నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి  జియో రూ .6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది మన రాష్ట్ర అభివృద్ధి పట్ల వారి అపారమైన నిబద్ధతను చూపిస్తుంది. 2023 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి” అని చెప్పారు.

 
గౌరవనీయ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్. జ‌వ‌హ‌ర్ రెడ్డి మాట్లాడుతూ, “జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 

 
స్టార్ట‌ప్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జియో ట్రూ 5 జి సేవల రాక ఐఓటి, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ & డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేస్తున్న స్టార్టప్ లకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. జియో ట్రూ 5జి రాక ఆంధ్రప్రదేశ్ లో ఈ స్టార్టప్ లను మరింత ముందుకు నడిపిస్తుంది, వారికి ఎగరడానికి కొత్త రెక్కలు ఇస్తుంది” అని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

 
ఈ సందర్భంగా జియో ప్రతినిధి మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో జియో ట్రూ 5జీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువ‌ల్ల ఈ గ‌ణ‌నీయ‌మైన మార్పుకు ఉన్న శ‌క్తి, దాని అపార ప్ర‌యోజ‌నాల‌ను మ‌న దేశంలోని ప్ర‌తి పౌరుడు అనుభవించగలడు.  ఆంధ్రప్రదేశ్ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అన్నారు.

 
డిసెంబర్ 26 నుంచి తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులోని జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.