శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 మార్చి 2025 (00:04 IST)

వచ్చే వారం భారతదేశంలో 3 గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనున్న సామ్‌సంగ్

Samsung Galaxy S25
సామ్‌సంగ్ వచ్చే వారం భారతదేశంలో మూడు కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గెలాక్సీ ఎ భారతదేశంలో సామ్‌సంగ్ యొక్క అత్యంత విజయవంతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్, సామ్‌సంగ్ ప్రతి సంవత్సరం లక్షలాదిగా ఈ ఫోన్లను విక్రయిస్తుంది. కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు గత సంవత్సరం విడుదల చేసిన గెలాక్సీ ఎ 35, గెలాక్సీ ఎ 55 స్మార్ట్‌ఫోన్‌లకు వారసులుగా ఉంటాయి. 
 
యువ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త డిజైన్, మెరుగైన మన్నిక, అధునాతన భద్రతను కలిగి ఉంటాయి, ఇవి సౌకర్యవంతమైన, సురక్షితమైన వినియోగదారు అనుభవాన్ని నిర్ధారిస్తాయి.
 
సంవత్సరాలుగా, సామ్‌సంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌కు తమవైన రీతిలో ప్రతిష్టాత్మక ఫీచర్లను పరిచయం చేసింది, దాని తాజా ఆవిష్కరణలను విస్తృత శ్రేణిలో  వినియోగదారులకి చేరువ చేయటంలో సహాయపడుతుంది. మూడు కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల, సంప్రదాయాన్ని కొనసాగించటంతో పాటుగా భారతీయ వినియోగదారులకు ఎంచుకునేందుకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.