1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. US-based Microlink Networks to set up unit in Telangana with Rs.500 crore

తెలంగాణలో రూ.500 కోట్లతో మైక్రోలింక్ నెట్‌వర్క్స్ యూనిట్

sridhar babu
అమెరికాకు చెందిన మైక్రోలింక్ నెట్‌వర్క్స్ తెలంగాణలో రూ.500 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్లతో ఎలక్ట్రానిక్స్, ఐటీ, నిర్మాణ రంగ పరికరాల తయారీ యూనిట్‌ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. దీని వల్ల 700 మందికి ఉపాధి లభిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. 
 
అమెరికాకు చెందిన మైక్రోలింక్ నెట్‌వర్క్స్ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. 
 
హైదరాబాద్‌కు చెందిన పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ సహకారంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మైక్రోలింక్‌ ప్రతినిధులు, పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ శ్రీరంగారావుతో మంత్రి సమావేశమయ్యారు. 
 
తన ఇటీవల అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్‌వర్క్స్ యాజమాన్యం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించడంతో వారితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి చెప్పారు.
 
డేటా ట్రాన్స్‌మిషన్, నెట్‌వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్‌వర్క్స్ గ్లోబల్ లీడర్‌గా ఉందని, తెలంగాణలో నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత లేదని ఆయన అన్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి- 45 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ